తెలంగాణ విద్యాశాఖ రీడ్ కార్యక్రమం 2022
READ (Read-Enjoy-And- Develop)
(చదువు-ఆనందించు-అభివృద్ధి చెందు)
👉విద్యార్థులలో పఠన నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యం.
👉ప్రతి పాఠశాల లో 100 రోజుల పాటు నిర్వహించాలి.
👉 1 వ తరగతి నుండి 9 వ తరగతి వరకు
👉 లైబ్రరీ పీరియడ్ ప్రతి తరగతికి ఉండాలి.
👉ప్రతి ప్రాథమిక పాఠశాల లో ఐదుగురు విద్యార్థులతో గ్రంథాలయ కమిటీ ఏర్పాటు చేసుకోవాలి.
👉ఉన్నత పాఠశాల ల్లో ప్రతి తరగతికి గ్రంథాలయ కమిటీ ఉండాలి.
👉ప్రాథమిక పాఠశాల ల్లో లైబ్రరీ పీరియడ్ లో వారం మొత్తంలో 4 రోజులు తెలుగు, రెండు రోజులు ఇంగ్లీషు నిర్వహించాలి.
👉ఉన్నత పాఠశాల ల్లో 3రోజులు తెలుగు, 2 రోజులు ఇంగ్లీషు, 1 రోజు హిందీ నిర్వహించాలి.
👉 ప్రతి శనివారం పఠన పోటీలు నిర్వహించాలి.
👉నెలకు ఒకసారి పఠనోత్సవం SMC, మరియు తల్లిదండ్రుల సమక్షంలో నిర్వహించాలి.
👉 READ కార్యక్రమ రిజిష్టర్ నిర్వహించాలి.
👉 విద్యార్థులలో చదవడం రాయడం రాని వారిని వచ్చిన విద్యార్థులతో జత చేయాలి. బొమ్మల కథల పుస్తకాలతో వారిని ప్రోత్సాహించాలి.
👉 ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అందరూ కలిసి , ప్రత్యేక టైం టేబుల్ ఏర్పాటు చేసుకొని నిర్వహించాలి. ప్రతి నెల సమీక్షా సమావేశం నిర్వహించుకోవాలి.
👉 ఈ నెల 14 నుండి 21 వరకు గ్రంథాలయ వారోత్సవాలు జరపాలి. ముఖ్యముగా లైబ్రరీ పటిష్టత కోసం పుస్తకాల సేకరణ కై కృషి చేయాలి.
👉 21 ఫిబ్రవరి నాడు అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం జరపాలి.
👉రాష్ట్ర ,జిల్లా, మండల స్థాయిలో మానిటరింగ్ బృందాలు పర్యవేక్షిస్తాయి.
No comments:
Post a Comment